ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల హంగామా: కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఉద్రిక్తత

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి: బీఆర్‌ఎస్ శ్రేణుల హంగామా

హైదరాబాద్, జనవరి 16: ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేటీఆర్‌ ఈడీ కార్యాలయానికి రాబోతున్నారని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ చేరారు. దీనితో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

గులాబీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారు. కేటీఆర్ వాహనం వచ్చిన వెంటనే, శ్రేణులు ఒక్కసారిగా కార్యాలయం వైపు దూసుకొచ్చారు. ముందుగానే 200 మంది పోలీసుల భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. కేటీఆర్ వాహనం చుట్టూ వందలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ కూర్చున్నారు.

వారిని కష్టంగా అక్కడి నుంచి తరలించిన తర్వాత మాత్రమే కేటీఆర్ వాహనాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఈ దశలో, ఈడీ కార్యాలయం వద్ద స్వల్ప తోపులాట కూడా జరిగింది. పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసు చర్యలను నిరసిస్తూ, “పోలీసు జులుం నశించాలి” అనే నినాదాలు వినిపించాయి. అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించినందుకు పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాకతో, పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారు.

ఈవార్తను కూడా చదవండి: 

One thought on “ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల హంగామా: కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఉద్రిక్తత

Comments are closed.