తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన – బీసీ కులగణన, రైల్వే ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ

Senior Congress Leader, Lok Sabha Opposition Leader రాహుల్ గాంధీ మంగళవారం Telanganaకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు. బీసీ కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. అలాగే రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.

New Delhi: కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi మంగళవారం Telangana పర్యటనలో భాగంగా వరంగల్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ వెళతారు. అక్కడ తన పర్యటన ముగిసిన అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. రాత్రి 7:30 గంటలకు రైలులో చెన్నై కి ప్రయాణించనున్నారు. వరంగల్‌లో ప్రైవేట్ ఈవెంట్ లో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

రాహుల్ గాంధీ BC Caste Census, SC Categorization అంశాలపై ప్రజల స్పందనను తెలుసుకుంటారు. అంతేకాకుండా, రైల్వే ప్రైవేటీకరణ పై రైలు ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్రైన్‌లో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

AICC అగ్రనేత రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ , పీసీసీ కమిటీ నిర్మాణానికి సంబంధించి ఏమైనా కీలక సంకేతాలు వెలువడతాయా అనే దానిపై పార్టీ వర్గాలు దృష్టి సారించాయి.

Read more