సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేశారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. మంగళవారం (ఫిబ్రవరి 18) అమనల్లో జరిగిన రైతుదీక్షలో KTR మాట్లాడారు. “సీఎం రేవంత్ 420 హామీలను ఇచ్చాడు. వాటిలో ఏదైనా అమలు అయ్యాయా? రైతు బంధు, రుణ మాఫీ అందిందా? తులం బంగారం ఇచ్చారా? ఏదీ జరగలేదు.
దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగలు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పి BCs ను మోసం చేశాడు. రైతులను మోసం చేశాడు. స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు, కానీ పాలన చేయడంలో అతడు విఫలమయ్యాడు” అని KTR మండిపడ్డారు.
