హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో కొత్త టెక్నాలజీ.. మేడ్చల్‌, శామీర్‌పేట్‌ కారిడార్లకు కొత్త రూపు

2nd phase metro hyderabad

హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో కొత్త టెక్నాలజీ పరిచయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లలో అనేక కొత్త మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర భూగర్భ కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి Detailed Project Report (DPR) సిద్ధం చేసే ప్రక్రియలో మెట్రో అధికారులు జోరుగా పనిచేస్తున్నారు. 23 కిలోమీటర్ల పరడైజ్- మేడ్చల్ కారిడార్‌ మరియు 22 కిలోమీటర్ల JBS- శామీర్‌పేట్ కారిడార్లకు సంబంధించిన సర్వేలు పూర్తి చేసారు.

DPR తయారీకై మూడు ముఖ్యమైన అధ్యయనాలు అవసరమని గుర్తించారు: 1) Traffic Survey, 2) Geotechnical Investigation (Soil Testing), 3) Environmental Impact Assessment (EIA).

Traffic Survey లో, ఈ మార్గాల్లో జరిపే ప్రయాణాల అంచనాలు, ప్రజల ప్రయాణాలు, వాహనాల గణన, కొత్త మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య వంటి అంశాలు పరిశీలిస్తున్నారు.

పర్యావరణ ప్రభావ అధ్యయనంలో గాలి నాణ్యత, కాలుష్య కారకాలు, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, ప్రకృతి జీవనాధారాలు వంటి అంశాలు సమగ్రంగా పరిశీలించబడతాయి.

భూసామర్థ్య పరీక్షల ద్వారా, మట్టి, రాతి పొరల నమూనాలు, భూగర్భ జలాలు, భూకంపాలు, మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూసామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు.

ప్రస్తుతం, Hyderabad Metro Rail Limited (HMRL) అధికారులు JBS-Medchal మార్గంలో 25 చోట్ల మరియు JBS-Shamirepete మార్గంలో 19 చోట్ల భూసామర్థ్య పరీక్షలు చేస్తున్నారు.

మార్చి నెలాఖరులో, మెట్రో మార్గాల DPRలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని HMRL MD NVS రెడ్డి తెలిపారు.

Read More

One thought on “హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో కొత్త టెక్నాలజీ.. మేడ్చల్‌, శామీర్‌పేట్‌ కారిడార్లకు కొత్త రూపు

Comments are closed.