శేఖర్ కమ్ముల: ధనుష్పై టెన్షన్.. కానీ ఆశ్చర్యం కలిగించాడు!
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’ (Kubera) షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను శేఖర్ కమ్ముల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘‘కుబేర’ కథ సిద్ధమైంది. ఈ కథలో బిచ్చగాడి పాత్రను ధనుష్కు ఎలా చెప్పాలోననే ఓ సంకోచం నాకు ఉండేది. అసలు ఆయనకు నేను తెలుసో లేదోనన్న అనుమానం కూడా నన్ను వెంటాడింది. కానీ, నేను ధనుష్కు ఫోన్ చేయగానే ఆయన నన్ను ఆశ్చర్యపరిచారు. నేను తీసిన సినిమాలు ఆయన చూశారని, ఆ సినిమాల్లో ఆయనకు ఇష్టమైన సన్నివేశాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారని’’ శేఖర్ కమ్ముల చెప్పారు.
‘‘ధనుష్ లాంటి నటుడితో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభూతి. ఆయన పాత్రలోకి మాయమైపోయే విధానం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
రష్మిక గురించి మాట్లాడుతూ, ‘‘రష్మిక చాలా కష్టపడే వ్యక్తి. నేను ఈ కథ చెప్పడానికి ముంబై వెళ్లినప్పుడు ఆమె అక్కడ ‘యానిమల్’ (Animal) సినిమా డబ్బింగ్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ‘పుష్ప 2’ (Pushpa 2) షూటింగ్ కూడా కొనసాగుతోంది. విరామం లేకుండా ముంబై నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణిస్తూ, సెట్లో ఆమెలో ఎక్కడా అలసట కనిపించలేదు. రష్మిక నిజంగా ఓ మెరుపులాంటి వ్యక్తి. ఇందులో ఆమె పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు.
రష్మిక, ధనుష్ కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వారి స్క్రీన్ ప్రెజెన్స్లో కొత్తదనం ఉంటుంది’’ అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి
Subscribe to our YouTube channel
Follow for more
Follow for more
