మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, ఈ అమృత స్నానం ఎందుకంత ప్రత్యేకం, దీని ప్రాముఖ్యత ఏంటని తెలుసుకుందాం.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం – వెయ్యేళ్ల యాగాలకు సమానం
భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాల్లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక పవిత్రమైన వేడుకగా నిర్వహించబడుతోంది. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరగే ఈ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కుంభమేళాలో పాల్గొనడం ద్వారా భక్తులు, సాధువులు అనేక పుణ్యఫలాలు సాధిస్తారని నమ్ముతారు.
రెండో అమృత స్నానం
జనవరి 29న జరుగనున్న రెండో అమృత స్నానం (Second Amrit Snan) కోసం సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో 13 నాగ సాధు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోతారు. ఈ నాగ సాధువులు అమృత స్నానం రోజు ముందుగా స్నానం చేస్తారు.
సాధువుల స్నానం తర్వాత
హిందూ మతంలో మహా కుంభమేళా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది 12 సంవత్సరాల తర్వాత జరగుతుంది. ఈ కుంభమేళా ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్ వంటి నాలుగు ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది. నాగ సాధువుల మొదటి స్నానం మతం మరియు ఆధ్యాత్మిక శక్తికి సంబంధించి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అమృత స్నానంలో మొదట 13 అఖాడాల నుంచి నాగులు, సాధువులు, ఆచార్యులు, మహామండలేశ్వరులు, స్త్రీ నాగ సాధువులు స్నానం చేస్తారు. ఆ తరువాత భక్తుల వంతు వస్తుంది. కుంభమేళా సంప్రదాయం ప్రకారం, అమృత స్నానం ప్రత్యేకమైన తేదీల్లో మాత్రమే జరుగుతుంది.
ఈ వార్త కూడా చదవండి
Subscribe to our YouTube channel: https://www.youtube.com/@NewsTAPLive

One thought on “మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం: ప్రాముఖ్యత, సన్నాహాలు, మరియు భక్తులకు ఉండే ప్రయోజనాలు”
Comments are closed.