తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రెండో రోజు సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ వంటి తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయాలని సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు.
సింగపూర్, జనవరి 18: సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం, తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ, వాణిజ్య ఇన్చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్తో సమావేశమయ్యారు. ఈ చర్చలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం మరియు సాంకేతికత రంగాలలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సక్సెస్ చేయడంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్ సానుకూలంగా స్పందించారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్, పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపించారు.
ఇందులో భాగంగా, సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన అవకాశాలపై చర్చ జరిగింది. సింగపూర్ మేధోమధనంలో పాల్గొని, సెమీకండక్టర్ రంగంలో తన అభివృద్ధిని, ఉత్తమ పద్ధతులను పంచుకున్న ప్రతినిధులు, ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు.
ఈ సమావేశంలో ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు తెలంగాణకు తమ సానుకూలతను వ్యక్తం చేస్తూ, ఈ ఏడాది చివర్లో హైదరాబాద్ను సందర్శించనున్నారు.
మొత్తానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది, మున్ముందు మరిన్ని పెట్టుబడుల అవకాశాలు తెరచేలా ఉంటుంది.
ఇవి కూడా చదవండి.

One thought on “సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ, సింగపూర్ సహకార అవకాశాలపై చర్చలు”
Comments are closed.