ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పై సోషల్ మీడియాలో ఓ అనుచిత పోస్టు తీవ్ర చర్చకు దారి తీసింది. హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పవన్పై వివాదాస్పద పోస్టు చేశారు. ఇటీవల మహాకుంభమేళాలో తన సతీమణి అనా కొణిదెలతో కలిసి పవన్ పుణ్యస్నానం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఫోటోకు మరో సినీ నటుడి చిత్రం జతచేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో జనసేన వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జనసేన నేతల అభ్యంతరం – పోలీసుల వద్ద ఫిర్యాదు
ఈ ఘటనపై జనసేన నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇలాంటి అనవసర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు రిషికేష్ కావలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కూటమి నేతలు కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం
ఫిబ్రవరి 18న మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ తన భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరా నందన్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయి తదితరులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, “భారతదేశంలోని ప్రజలు విభిన్న జాతులు, తెగలు, సంప్రదాయాలను పాటించినా, సనాతన ధర్మాన్ని అందరూ సమానంగా ఆదరిస్తారు. భవిష్యత్తులో కూడా సనాతన ధర్మం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. మహాకుంభమేళా వంటి పుణ్య కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు, అర్థరహిత ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం” అని పేర్కొన్నారు.

One thought on “జనసేన నేతల ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు..?”
Comments are closed.